కువైట్ లోని ప్రవాసులకు ముఖ్య గమనిక..
- July 26, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.కువైట్ లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్ఫారమ్లో నిర్వహించడం లేదని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా రాయబార కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రాయబార కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైట్ లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చేయాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..