కువైట్ లోని ప్రవాసులకు ముఖ్య గమనిక..
- July 26, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.కువైట్ లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్ఫారమ్లో నిర్వహించడం లేదని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా రాయబార కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రాయబార కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైట్ లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చేయాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







