‘బింబిసార’ ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్న తారక్.!
- July 26, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘బింబిసార’. విజువల్ వండర్లా సోషల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇటీవల రిలీజైన ‘బింబిసార’ టీజర్కి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చిందంతే.
అయితే, ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యేలా కథనాలు పుట్టుకొస్తున్నాయ్. ఈ సినిమాని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు పార్టులుగా తెరకెక్కించనున్నారట. మొదటి పార్ట్ అంతా కళ్యాణ్ రామ్పైనే ఫోకస్ వుంటుందట.
కానీ, రెండో పార్ట్లో ఎన్టీయార్ గెస్ట్ అప్పియరెన్స్ వుంటుందంటున్నారు. ఇక మూడు, నాలుగు పార్టులు మొత్తం ఎన్టీయార్ యాంగిల్ నుంచే తెరకెక్కిస్తారట. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అదలా వుంటే, ఈ సినిమాని తారక్ స్పెషల్గా ప్రమోట్ చేయబోతున్నాడట. ఈ నెల 29న జరిగే ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీయార్ ముఖ్య అతిథిగా రానున్నాడట.ఈ విషయాన్నిస్పెషల్గా ఓ టీజర్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు.
శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?









