‘లైగర్’ విజయ్ దేవరకొండ: రాజువయ్యా మహరాజువయ్యా.!
- July 30, 2022
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారి విజయ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇక్కడా అక్కడా, అనే తేడా లేకుండా క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం ముంబయ్ ప్రమోషన్లలో బిజీగా వున్న విజయ్ దేవరకొండ, ముంబయ్ ప్రయాణంలో భాగంగా ట్రైయిన్లో వెళుతూ హీరోయిన్ అనన్యా పాండే ఒళ్లో పడుకుని వున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ ఫోటోకి విజయ్ ఫ్యాన్స్ మురిసిపోతుంటే, కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయినా, విజయ్ లెక్కే వేరు. యూత్ని ఎలా ఎట్రాక్ట్ చేయాలో విజయ్కి బాగా తెలుసు. యూత్ని ఎట్రాక్ట్ చేసేందుకే ఇలాంటివి చేస్తుంటాడు విజయ్ దేవరకొండ.
తన గత చిత్రాలైన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తదితర సినిమాల టైమ్లోనూ విజయ్ ఇలాగే బిహేవ్ చేశాడు. అలాగే యూత్లో పాపులారిటీ పెంచుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేతో కలిసి అలాంటి పబ్లిసిటీ స్టంట్సే చేస్తున్నాడు.. అంటూ కొందరు నెటిజన్లు విజయ్ని ట్రోల్ చేస్తున్నారు.
అవును మరి, టెక్నిక్.. టెక్నిక్ తెలియాలి బాస్.. అంటూ విజయ్ ఫ్యాన్స్ రౌడీస్ ట్రోలర్స్కి ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ‘లైగర్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







