అరబ్ పార్లమెంట్ సెషన్ లో పాల్గొన్న ఒమానీ పిల్లలు
- July 31, 2022
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా విశ్వవిద్యాలయం నిర్వహించిన అరబ్ పార్లమెంట్ ఫర్ ది చైల్డ్ రెండవ సెషన్లో ఒమన్ సుల్తానేట్ పిల్లలు పాల్గొన్నారు. పార్లమెంటరీ విధులు, బాధ్యత తదితర అంశాలపై రూపొందించిన అరబ్ పార్లమెంట్ డిప్లొమాలో 17 అరబ్ దేశాలకు చెందిన 77 మంది ఆనర్స్ డిగ్రీని సాధించారు. పిల్లలలో పార్లమెంటరీ విలువలు, సూత్రాలను తెలియజేయడం, భవిష్యత్ పార్లమెంటేరియన్లుగా వారిని సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్సలెన్స్ డిగ్రీని పొందడం పట్ల పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటులోని బాలల హక్కుల కమిటీ ఉపాధ్యక్షుడు కడాస్ బింట్ అబ్దుల్లా అల్-రియామియా మాట్లాడుతూ.. ఆరు నెలల కోర్సులో భాగంగా విద్యార్థులకు నాయకత్వం, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఇతర పార్లమెంటరీ నైపుణ్యాల పట్ల అవగాహన కల్పించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు







