భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- February 21, 2026
న్యూ ఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత గ్లోబల్ పాప్ స్టార్ షకీరా మళ్లీ భారత్లో స్టేజ్ మీదకు రానుంది. 2007 తర్వాత ఇదే ఆమె మొదటి ఇండియా పర్యటన కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ‘ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్ 2026’ కార్యక్రమం భాగంగా ముంబైలో ఏప్రిల్ 10న, ఢిల్లీలో ఏప్రిల్ 15న భారీ స్థాయిలో సంగీత వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ను District by Zomato నిర్వహిస్తుండగా, HSBC మద్దతు ఇస్తోంది.
ఈ కాన్సర్ట్ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, దేశంలోని పిల్లల పోషకాహార సమస్యలపై అవగాహన కల్పించడం, వారికి మెరుగైన భవిష్యత్తు కల్పించాలనే సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్నారు.
షకీరా చివరిసారి 2007లో తన Oral Fixation Tour సందర్భంగా ముంబైలో ప్రదర్శన ఇచ్చింది. అప్పట్లో ఒక్క నగరంలోనే షో జరిగింది. అయితే ఈసారి ముంబైతో పాటు ఢిల్లీలో కూడా కాన్సర్ట్ నిర్వహించడం ప్రత్యేకతగా మారింది. ముంబై – ఏప్రిల్ 10, 2026 – మహాలక్ష్మి రేస్కోర్స్, ఢిల్లీ – ఏప్రిల్ 15, 2026 – జవహర్లాల్ స్టేడియం. షకీరా ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఇండియాలో పాడడం నాకు ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి. ముంబై, ఢిల్లీ అభిమానులతో మళ్లీ కలవడానికి ఆసక్తిగా ఉన్నాను. ఈ కార్యక్రమం సంగీతానికి మించినది. ప్రతి పిల్లవాడికి సరైన పోషకాహారం అందించాలనే లక్ష్యంతో మనం కలిసి నిలబడాలి” అని తెలిపింది. లాటిన్ పాప్ ప్రపంచంలో షకీరా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 100 మిలియన్లకు పైగా ఆల్బమ్లు అమ్ముడైన ఆమె ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మహిళా లాటిన్ గాయనిలలో ఒకరు. షకీరా పూర్తి పేరు షకీరా ఇసాబెల్ మెబారక్ రిపోల్. 1977 ఫిబ్రవరి 2న కొలంబియాలో జన్మించిన ఆమె ప్రపంచ ప్రఖ్యాత లాటిన్ పాప్ గాయని, గేయరచయిత్రి, డ్యాన్సర్.
ప్రత్యేకమైన వాయిస్, బెల్లీ డ్యాన్స్ స్టైల్, ఎనర్జిటిక్ స్టేజ్ ప్రెజెన్స్ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. షకీరా అనేక గ్రామీ, లాటిన్ గ్రామీ అవార్డులు గెలుచుకుంది. 100 మిలియన్లకు పైగా రికార్డులు అమ్ముడయ్యాయి. సంగీతంతో పాటు ఆమె Barefoot Foundation ద్వారా పిల్లల విద్య, సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
షకీరా లాటిన్ పాప్ ప్రపంచానికి ఒక ఐకాన్, గ్లోబల్ మ్యూజిక్ రంగంలో చిరస్థాయి గుర్తింపు పొందిన స్టార్. ఆమె పాడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాయి. గ్రామీ, లాటిన్ గ్రామీ అవార్డులు సహా అనేక గౌరవాలు అందుకున్న షకీరా, ఇటీవల నిర్వహించిన Las Mujeres Ya No Lloran Tour ద్వారా లాటిన్ కళాకారిణిగా అత్యధిక ఆదాయం సాధించిన టూర్గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
తాజా వార్తలు
- కొడుకు ప్రాణం తీసిన డ్రైవర్ను క్షమించిన తల్లిదండ్రులు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!









