కార్నిచ్లో నిలిచిన వర్షపు నీరు.. వీడియోలు వైరల్
- July 31, 2022
దోహా: వర్షపు నీటి తరలింపు నెట్వర్క్లో పనులు పూర్తికాకపోవడంతో కార్నిచ్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు వర్షాకాలం కోసం ముందస్తు సన్నాహక సూచనలను పాటించలేదని, వారిపై అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు అష్ఘల్ అధ్యక్షుడు డాక్టర్ ఎంగ్ సాద్ అల్ ముహన్నడి తెలిపారు. గురువారం కురిసిన వర్షాలకు కార్నిచ్ స్ట్రీట్ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అష్ఘల్ అధ్యక్షుడు స్పందించారు. ఖతార్ ఎక్స్ప్రెస్వేల కోసం రెయిన్వాటర్ డ్రైనేజీ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కార్నిచ్, మిడ్టౌన్ దోహా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పనులు, రెయిన్వాటర్ డ్రైనేజీ నెట్వర్క్ ప్రాజెక్ట్ను అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!









