యూఏఈ: 10వేల మంది భారతీయు కార్మికులకు ఉద్యోగాలు..
- August 02, 2022
దుబాయ్: యూఏఈలోని భారత కాన్సులేట్ వచ్చే ఏడాది ఆ దేశంలో కనీసం 10వేల మంది మంచి నైపుణ్యం కలిగిన ఇండియన్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) ప్రాజెక్ట్ ద్వారా ఇలా భారీ సంఖ్యలో భారత ప్రవాసులకు ఉపాధి కల్పించనున్నట్లు ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్లోని కాన్సుల్ (ప్రెస్, ఇన్ఫర్మేషన్, కల్చర్ & లేబర్) తాడు మాము అన్నారు. ఇటీవలి కాలంలో ప్రవాసులు ఏజెంట్ల ద్వారా విదేశాలకు వచ్చి మోసపూరిత నియామకాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ (NSDC)తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి కాన్సులేట్ శ్రీకారం చుట్టింది. NSDC కు చెందిన సిబ్బంది యూఏఈలో వివిధ రంగాలలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలను తెలుసుకుని వాటికి తగ్గటుగా ప్రవాసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.హెల్త్కేర్, రిటైల్ తదితర రంగాలలో ఇలా ప్రవాసులకు శిక్షణ ఇచ్చి అనంతరం వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది.ఈ ఏడాది మార్చిలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని దుబాయ్ ఎక్స్పో 2020 ప్రారంభించడం జరిగింది.ఇక ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) శిక్షణ కార్యక్రమం అనేది ఇటు భారత్తో పాటు అటు దుబాయ్లో కూడా నిర్వహించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







