యూఏఈ: 10వేల మంది భారతీయు కార్మికులకు ఉద్యోగాలు..
- August 02, 2022
దుబాయ్: యూఏఈలోని భారత కాన్సులేట్ వచ్చే ఏడాది ఆ దేశంలో కనీసం 10వేల మంది మంచి నైపుణ్యం కలిగిన ఇండియన్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) ప్రాజెక్ట్ ద్వారా ఇలా భారీ సంఖ్యలో భారత ప్రవాసులకు ఉపాధి కల్పించనున్నట్లు ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్లోని కాన్సుల్ (ప్రెస్, ఇన్ఫర్మేషన్, కల్చర్ & లేబర్) తాడు మాము అన్నారు. ఇటీవలి కాలంలో ప్రవాసులు ఏజెంట్ల ద్వారా విదేశాలకు వచ్చి మోసపూరిత నియామకాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ (NSDC)తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి కాన్సులేట్ శ్రీకారం చుట్టింది. NSDC కు చెందిన సిబ్బంది యూఏఈలో వివిధ రంగాలలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలను తెలుసుకుని వాటికి తగ్గటుగా ప్రవాసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.హెల్త్కేర్, రిటైల్ తదితర రంగాలలో ఇలా ప్రవాసులకు శిక్షణ ఇచ్చి అనంతరం వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది.ఈ ఏడాది మార్చిలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని దుబాయ్ ఎక్స్పో 2020 ప్రారంభించడం జరిగింది.ఇక ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) శిక్షణ కార్యక్రమం అనేది ఇటు భారత్తో పాటు అటు దుబాయ్లో కూడా నిర్వహించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







