భారత్ కరోనా అప్డేట్
- August 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.34 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
నిన్న కరోనా వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో కరోనా మృతుల సంఖ్య మొత్తం 5,26,430కు చేరింది. దేశంలో నిన్న 4,11,102 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87.58 కోట్లకు చేరినట్లు వివరించింది. దేశంలో నిన్న 26,77,405 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.6 కోట్లకు చేరిందని వివరించింది. వాటిలో రెండో డోసు 93.33 కోట్లు, బూస్టర్ డోసు 9.28 కోట్లు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







