భారత్ కరోనా అప్డేట్
- August 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.34 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
నిన్న కరోనా వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో కరోనా మృతుల సంఖ్య మొత్తం 5,26,430కు చేరింది. దేశంలో నిన్న 4,11,102 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87.58 కోట్లకు చేరినట్లు వివరించింది. దేశంలో నిన్న 26,77,405 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.6 కోట్లకు చేరిందని వివరించింది. వాటిలో రెండో డోసు 93.33 కోట్లు, బూస్టర్ డోసు 9.28 కోట్లు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









