భారత్ కరోనా అప్డేట్
- August 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.34 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
నిన్న కరోనా వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో కరోనా మృతుల సంఖ్య మొత్తం 5,26,430కు చేరింది. దేశంలో నిన్న 4,11,102 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87.58 కోట్లకు చేరినట్లు వివరించింది. దేశంలో నిన్న 26,77,405 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.6 కోట్లకు చేరిందని వివరించింది. వాటిలో రెండో డోసు 93.33 కోట్లు, బూస్టర్ డోసు 9.28 కోట్లు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







