రూటు మార్చిన మాస్ రాజా: ‘ఆ’ హ్యాట్రిక్కి ఛాన్సివ్వనంటున్నాడు.!
- August 02, 2022
‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రవితేజను నిండా ముంచేశాయ్. అంచనాలు భారీగానే వున్నా, డిజాస్టర్లో రికార్డులు కొల్లగొట్టాయ్. దాంతో రవితేజ తేరుకున్నాడట. ఈ సారి రాబోయే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలనుకుంటున్నాడట.
అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అస్సలు నెగ్లిజన్సీ ప్రదర్శించకూడదని డిసైడ్ అయిపోయాడట. రవితేజ ట్రాక్లో ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్పై వున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘ధమాకా’. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.
ట్రాక్ రికార్డు బాగా వున్న నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి దర్శకుడు. మాస్ రాజా మార్క్కి తగ్గట్లుగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడట నక్కిన త్రినాధరావు. దాంతో, ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో రవితేజ కూడా సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.
‘రామారావు ఆన్ డ్యూటీ’ చూశాకా, షూటింగ్ జరుగుతున్నప్పుడే, రవితేజ అవుట్ పుట్ చూసుకోలేదా.? మరీ ఇంత చెత్త సినిమా ఎలా చేశాడంటూ, ఆయన ఫ్యాన్సే రవితేజను తిట్టి పోసేశారు. దాంతో, ఈ సారి ఆ తప్పు చేయనంటున్నాడట మాస్ రాజా.
ఇదిలా వుంటే, తదుపరి, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా విషయంలోనూ తగ్గేదేలే.. అంటున్నాడట మాస్ రాజా.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







