రూటు మార్చిన మాస్ రాజా: ‘ఆ’ హ్యాట్రిక్కి ఛాన్సివ్వనంటున్నాడు.!
- August 02, 2022
‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రవితేజను నిండా ముంచేశాయ్. అంచనాలు భారీగానే వున్నా, డిజాస్టర్లో రికార్డులు కొల్లగొట్టాయ్. దాంతో రవితేజ తేరుకున్నాడట. ఈ సారి రాబోయే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలనుకుంటున్నాడట.
అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అస్సలు నెగ్లిజన్సీ ప్రదర్శించకూడదని డిసైడ్ అయిపోయాడట. రవితేజ ట్రాక్లో ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్పై వున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘ధమాకా’. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.
ట్రాక్ రికార్డు బాగా వున్న నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి దర్శకుడు. మాస్ రాజా మార్క్కి తగ్గట్లుగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడట నక్కిన త్రినాధరావు. దాంతో, ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో రవితేజ కూడా సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.
‘రామారావు ఆన్ డ్యూటీ’ చూశాకా, షూటింగ్ జరుగుతున్నప్పుడే, రవితేజ అవుట్ పుట్ చూసుకోలేదా.? మరీ ఇంత చెత్త సినిమా ఎలా చేశాడంటూ, ఆయన ఫ్యాన్సే రవితేజను తిట్టి పోసేశారు. దాంతో, ఈ సారి ఆ తప్పు చేయనంటున్నాడట మాస్ రాజా.
ఇదిలా వుంటే, తదుపరి, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా విషయంలోనూ తగ్గేదేలే.. అంటున్నాడట మాస్ రాజా.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







