అచ్చుతాపురం విషవాయువు లీక్ ఘటనపై సిఎం జగన్ ఆరా
- August 03, 2022
అమరావతి: ఏపిలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో విషవాయువు లీక్ ఘటనపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిం చాలని విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, కారణాలను వెలికితీయాలని అధికారుల ను ఆదేశించారు. భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ జరిపించాలని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. నిన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో విషవాయువు లీకై 95 మంది అస్వస్థతకు గురై పలు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రి అమర్నాథ్ ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







