తదుపరి సీజేఐగా జస్టిస్ యుయు లలిత్: కేంద్రానికి జస్టిస్ రమణ సిఫార్సు
- August 04, 2022న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తదుపరి చీఫ్ జస్టిస్గా యుయు లలిత్ పేరును చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ నేడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రికమండేషన్ లెటర్ను కూడా జస్టిస్ లలిత్కు సీజేఐ రమణ అందజేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నుంచి బుధవారం రాత్రి సీజేఐ సెక్రటేరియేట్కు ఫోన్ కాల్ వెళ్లింది. తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని మంత్రి రిజుజు ఎన్వీ రమణను కోరారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26వ తేదీన ముగియనున్నది. ఆ తర్వాత జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే చాలా తక్కువ కాలమే జస్టిస్ లలిత్ ఆ పదవిలో ఉండనున్నారు. ఆయన నవంబర్ 8వ తేదీన రిటైర్ అవుతారు. జస్టిస్ లలిత్ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రచూడ్ మాత్రం రెండేళ్లు సీజేఐగా చేసే ఛాన్సు ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ