గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- August 08, 2022
మనామా: గృహ కార్మికుల అరోగ్య పరీక్షలు ఇక నుండి పూర్తిగా ప్రైవేటీకరణ చేసినట్లు అరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కమిషన్ అధిపతి డాక్టర్ ఐషా అహ్మద్ హుస్సేన్ ప్రకటించారు.
ఈ ప్రకటన విదేశీయుల వైద్య పరీక్షల నియంత్రణకు సంబంధించి 2017 నిర్ణయం (30) లోని కొన్ని నిబంధనలు సవరిస్తూ 2022 నిర్ణయం (21) అమలులోకి వస్తుంది.
ఈ విధానాన్ని అమలు చేయడం కోసం అరోగ్య మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ మరియు లేబర్ మార్కెట్ నియంత్రణ అథారిటీ మరియు నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ లు కలిసి పనిచేయడం జరుగుతుందని డాక్టర్ హుస్సేన్ పేర్కొన్నారు.
గృహ కార్మికులు దేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి ఐదు రోజుల లోపు ఈ పరీక్షలను నిర్వహించాలని డాక్టర్ హుస్సేన్ పేర్కొన్నారు. స్థానం మరియు ఖర్చు పరంగా వారికి మరియు వారి యజమానులకు దగ్గరగా మరియు అత్యంత అనుకూలమైన ఆరోగ్య సంస్థను ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంది.
వారు జాతీయ పోర్టల్ http://Bahrain.bh ద్వారా అపాయింట్మెంట్ తేదీలను, అలాగే ప్రింట్ ఫలితాలు మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్లను బుక్ చేసుకోవచ్చు మరియు మార్చుకోవచ్చు అని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







