భారత్ కరోనా అప్డేట్
- August 10, 2022న్యూ ఢిల్లీ: భారత్లో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 5,26,826 మంది మృతిచెందారు. మరో 1,28,261 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్నుంచి బయటపడగా, 54 మంది మృతిచెందారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.29 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.52 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 207.03 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు