ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా కొత్త నిబంధనలు
- August 10, 2022
ఢిల్లీ: రుణ ఎగవేతదారులు, ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇతరులతో సహా నేరస్థులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. విదేశాలకు ప్రయాణించే ప్రయాణీకుల వివరాలను వారు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు పంచుకోవాలని విమానయాన సంస్థలను కోరింది. విమానయాన సంస్థలు అందించే సమాచారాన్ని పరిశీలనకు కొత్తగా నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్ - ప్యాసింజర్ (NCTC-P) ను ఏర్పాటు చేసింది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగమని పేర్కొంటూ ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్ 2022కి సంబంధించి నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎయిర్ లైన్స్ ఆపరేటర్ ప్రయాణీకుల రికార్డులను గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది. ఎయిర్లైన్ లేదా ఏజెన్సీ నిబంధనలను పాటించకపోతే రూ.25,000-రూ.50,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఎన్సిటిసి-పిని అమలు చేయడంలో ప్రధాన లక్ష్యం బ్యాంకు డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడమని.. గత ఐదేళ్లలో దాదాపు 40 మంది ఆర్థిక నేరగాళ్లు భారతదేశం నుంచి పారిపోయారని ప్రభుత్వం గతంలో పార్లమెంటుకు తెలియజేసింది. వారిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ (యుకెలో జైలులో ఉన్నారు), మెహుల్ చోక్సీ (డొమినికాలో ఉన్నారు) కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







