యూఏఈ-ఇండియా మధ్య నూతన డైరెక్ట్ ఫ్లయిట్ ప్రకటించిన ఇండిగో
- August 10, 2022
రాస్ అల్ ఖైమా: ముంబై-రాస్ అల్ ఖైమా మధ్య డైరెక్ట్ ఫ్లయిట్ ను ప్రముఖ భారత విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.ఆ సంస్థకు ఈ రూట్ 100 వ డెస్టినేషన్ కాబోతుంది.
ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ నూతన డైరెక్ట్ విమాన రాకపోకలు దోహదపడతాయి . అంతేకాకుండా మాకు సంస్థకు రాస్ అల్ ఖైమా రూట్ 26వ అంతర్జాతీయ విమాన రూట్ కాగా మొత్తంగా 100 వ విమాన రూట్ చాలా సంతోషకరం అని ఇండిగో రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు.
రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం ఇండిగో విమానయాన సంస్థ తో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం. భారత ఉపఖండం లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ నూతన డైరెక్ట్ విమానం చాలా బాగా ఉపయోగపడుతుందని రాస్ అల్ ఖైమా పౌర విమానయాన విభాగం ఛైర్మన్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ కష్మి తెలిపారు.
భారత ఉపఖండం లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇండిగో తో జరిగిన నూతన ఒప్పంద భాగస్వామ్యం చాలా దోహదపడుతుంది అని రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం సీయివో అటనో సియోస్ టిత్నాయిస్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







