NBK108 మూవీ ప్రకటన
- August 11, 2022హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ–సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా రాబోతుందని ఎప్పటి నుండో వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారనే అప్డేట్తో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది కూడా ఓ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ను షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. అలాగే ‘అఖండ’ అద్భుతమైన సక్సెస్కు ఓ కారణమైన సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక అనౌన్స్మెంట్ వీడియోలో.. ‘‘త్వరలో బాంబార్డింగ్…’’ అని తెలిపారు. ఈ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ అదిరిపోయింది. అనౌన్స్మెంట్ బిజీఎంతోనే అదరగొడితే.. సినిమాలో ఏ స్థాయిలో మ్యూజిక్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా బరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన