కదలకుండా కూర్చుంటే రోగాలు దరిచేరతాయి
- April 14, 2016
ఇంట్లో అయినా ఆఫీసులోనైనా సరే కదలకుండా కూర్చుంటే రోగాలు దరిచేరతాయి. ఈ విషయాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో పేర్కొంది. ఈ మేరకు 54 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడిందన్నారు. మనుషుల ప్రవర్తన, దేశ జనాభా, మరణాల సంఖ్య, ఇతర గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆయా దేశాల్లో సంభవించిన మరణాలను విశ్లేషించగా మూడు గంటల కంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం కారణంగా సంభవించిన మరణాల శాతం 3.8. ఈ తరహా మరణాలు అమెరికా, యూరోపియన్, తూర్పు మధ్యదరా దేశాలతో పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో కూడా ఎక్కువేనని తేలింది. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం కారణంగా కలిగే అనర్థాలను మనం శారీరకంగా ఎంత కష్టపడ్డా తగ్గించుకోలేమని పరిశోధకులు వెల్లడించారు.గంటల పాటు కూర్చుని ఉండే వాళ్లు గంటకోసారైనా లేచి రెండు, మూడు నిమిషాలు తిరగడం వల్ల అనారోగ్యం పాలవ్వకుండా ఉండవచ్చని ఆ జర్నల్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







