కదలకుండా కూర్చుంటే రోగాలు దరిచేరతాయి
- April 14, 2016
ఇంట్లో అయినా ఆఫీసులోనైనా సరే కదలకుండా కూర్చుంటే రోగాలు దరిచేరతాయి. ఈ విషయాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో పేర్కొంది. ఈ మేరకు 54 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడిందన్నారు. మనుషుల ప్రవర్తన, దేశ జనాభా, మరణాల సంఖ్య, ఇతర గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆయా దేశాల్లో సంభవించిన మరణాలను విశ్లేషించగా మూడు గంటల కంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం కారణంగా సంభవించిన మరణాల శాతం 3.8. ఈ తరహా మరణాలు అమెరికా, యూరోపియన్, తూర్పు మధ్యదరా దేశాలతో పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో కూడా ఎక్కువేనని తేలింది. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం కారణంగా కలిగే అనర్థాలను మనం శారీరకంగా ఎంత కష్టపడ్డా తగ్గించుకోలేమని పరిశోధకులు వెల్లడించారు.గంటల పాటు కూర్చుని ఉండే వాళ్లు గంటకోసారైనా లేచి రెండు, మూడు నిమిషాలు తిరగడం వల్ల అనారోగ్యం పాలవ్వకుండా ఉండవచ్చని ఆ జర్నల్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







