స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న ఎర్రకోట..
- August 13, 2022
భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది.ఇటీవలి తీవ్రవాద దాడులతోపాటు,ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు.ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.
వరుసగా మూడో ఏడాది కూడా కరోనా ఆంక్షల మధ్యే వేడుకలు జరగబోతున్నాయి.వీక్షకులు భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రధాని హోదాలో మోదీ ఇక్కడ జెండా ఎగురవేయనుండటం ఇది తొమ్మిదవసారి.ఎర్రకోట చుట్టూ దాదాపు 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.చుట్టుపక్కల వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.భద్రత పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్స్, మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.100 వరకు పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలు మోహరించాయి.ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వార్డ్లను మోహరించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







