ట్యాంక్ బండ్ పై మళ్లీ సన్డే ఫన్డే సంబరాలు
- August 13, 2022
హైదరాబాద్: ట్యాంక్బండ్ పై మళ్లీ సండే ఫన్డే సంబరాలు మొదలుకాబోతున్నాయి.కరోనా కు ముందు నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేసేవారు. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా హుస్సేన్సాగర్ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దడంతో నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షించేది. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ సందడికి బ్రేక్ పడింది.
కాగా రేపు (ఆదివారం) నుంచి మళ్లీ మొదలుకానున్నాయి.రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ట్యాంక్బండ్పై సన్డే ఫన్డే వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలో ట్యాంక్బండ్పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రకటించారు. ఆ సమయంలో ట్యాంక్బండ్ మీదుగా వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఇక దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ట్యాంక్బండ్పై సందడి నెలకొనబోతుంది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







