రావ్దా షరీఫ్ ప్రార్థనలకు కొత్త నిబంధనలు
- August 14, 2022
మదీనా : మదీనాలోని ప్రవక్త మస్జీదులోని రౌదా షరీఫ్లో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆరాధకులు ఉండేందుకు అనుమతి ఉందని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. తవక్కల్నా లేదా ఈటమర్నా దరఖాస్తుల ద్వారా యాత్రికులకు అనుమతిని జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మక్కాలోని గ్రేట్ మస్జీదులో ఉమ్రా/ ప్రార్థనలు చేయడానికి 1443 AH చివరి సీజన్లో 70 మిలియన్లకు పైగా అనుమతులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి హిషామ్ సయీద్ తెలిపారు. సౌదీ పౌరులు, నివాసితులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు (GCC) పౌరులు లేదా వివిధ రకాల వీసాలు ఉన్నవారు అయినా రౌదా షరీఫ్లో ఉమ్రా లేదా ప్రార్థన నిర్వహించాలనుకునే వారందరికి ఇప్పుడు టైమ్ స్లాట్లతో కూడిన అనుమతులను జారీ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!







