కేవలం 200 దిర్హములు షాపింగ్ చేసి..1 మిలియన్ దిర్హమ్లు గెలుచుకుంది..
- August 14, 2022
అబుధాబి: రిటైల్ దిగ్గజం లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ తన ‘మాల్ మిలియనీర్’ ప్రచారంలో భాగంగా నిర్వహించిన డిజిటల్ డ్రాలో అబుధాబిలో నివాసముంటున్న తమిళనాడుకు చెందిన సెల్వరాణి డేనియల్ జోసెఫ్..1 మిలియన్ దిర్హమ్లను గెలుచుకుంది.
ఆమెకు ఇద్దరు పిల్లలు భర్తతో కలిసి అబుధాబిలో నివాసం ఉంటున్నారు.ఆ మహిళను తాజాగా అదృష్టం వరించింది.కేవలం 200 దిర్హములు షాపింగ్ చేసి..1 మిలియన్ దిర్హమ్లు గెటుచుకున్నారు.ఈ క్రమంలో ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై లులు గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి సంబంధించిన షాపింగ్స్ మాల్స్ యూఏఈ వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అబుధాబిలో లులు మాల్స్ పేరుతో ఉన్న షాపింగ్ మాల్స్.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మొదటి వారం వరకు ‘మాల్ మిలియనీర్’ క్యాంపెయిన్ను నిర్వహించాయి. 200 దిర్హమ్లు ఖర్చు చేసి..ఈ క్యాంపెయిన్లో పాల్గొన్న కస్టమర్లకు..లక్కీ డ్రాలో ఒక మిలియన్ దిర్హమ్లను గెలుచుకునే అవకాశం కల్పించాయి.
ఈ నేపథ్యంలోనే భర్త, పిల్లలతోపాటు అబుధాబిలో నివసిస్తున్న తమిళనాడుకు చెందిన సెల్వరాణి డేనియల్ జోసెఫ్..ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నారు.కాగా..తాజాగా నిర్వహించిన డ్రాలో ఆమెకు లభించిన కూపన్కు నెంబర్కు జాక్పాట్ తగిలింది.ఏకంగా 1 మిలియన్ దిర్హమ్లు గెలుచుకున్నారు.ఈ విషయం తెలిసి ఆమె భర్త సహా ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.సెల్వరాణి కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చినందువల్ల.. ఆమె భర్త ఆ మొత్తానికి సంబంధించిన చెక్ను అందుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







