కువైట్ లో కడప జిల్లా వాసికి 'తెలుగు దేశం-కువైట్' ఆర్ధిక సాయం
- April 14, 2016
కడప జిల్లా రైల్వే కోడూరు వాసి యామల చంద్రయ్య కుటుంబం ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి లో నివాసం ఉంటుంది. కువైట్ లో భవన కార్మికుని గా పనిచేస్తూ గుండె సంబదిత వ్యాదితో అకాల మృత్యువాత పడ్డాడు. ఇతని వయసు 49 సంవత్సరాలు. ఇతనికి ఇద్దరు పిల్లలు. పేద కుటుంబం నుండి వచ్చిన చంద్రయ్య మరణం తో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
చంద్రయ్య మరణ వార్తను తెలుసుకొన్న నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు గారు తెలుగుదేశం-కువైట్ వారితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడాని కావలిసిన ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరారు.
నెల్లూరు జిల్లా వేంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు అభ్యర్ధన మేరకు కువైట్ తెలుగుదేశం సేవా విభాగం మృతదేహం ఇంటికి చేర్చుటకు కావలసిన డాక్యుమెంటేషన్ ను పూర్తి చేసి, దగ్గరుండి మృతదేహాన్ని ఎయిర్ పోర్ట్ కు తరలించారు. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి తమవంతు సాయంగా 200000 (రెండులక్షల రూపాయలు)ఆర్ధిక సాయాన్ని కూడా అందించారు.
200000 (రెండులక్షల రూపాయలు) చెక్కును మృతిని బందువుకు అందచేసారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని ఇండియా కు తరలించడానికి కువైట్ లోని ఇండియన్ ఎంబసి తమ పూర్తి సహాయ సహకారాలు అందించినది. మృతదేహాన్ని ఇండియా కు తరలించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆర్ధిక సహాయం చేసిన తెలుగుదేశం-కువైట్ గౌరవ సలహాదారులు శ్రీ రావెల్ల సుబ్బారాయుడు(బాబు నాయుడు), కాపెర్ల పట్టాభి రాము నాయుడు, నల్లాని సురేష్ నాయుడు అధ్యక్షులు శ్రీ కుదరవల్లి సుధాకర రావు, మరియు ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయుడు వేగి గార్లను నెల్లూరు జిల్లా వేంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు గారు అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







