-: మాన్యులు - సామాన్యులు :-
- April 14, 2016
రోజులు మారాయి,
రాజులు మారారు,
రోగాలు ముసిరాయి
రాగాల దోమలు ముదిరాయి!
విరోధాలు పెరిగాయి,
అవరోధాలు, ఆత్మహత్యలు అధికమయ్యాయి,
ఊరినిండా ఉన్మాదులు, 'ఉరి'తాళ్ళు వెతుకుతున్నారు
అర్ధాలకు పెడర్ధాలు పెరిగాయి
స్వార్ధాలు పరాకాష్టకు చేరుతున్నాయి!
మనలో విజ్ఞానం కొంత పెరిగితే
జ్ఞాన సూన్యులు మరింత పెరిగారు!
మాన్యులైన వారు మౌన ముద్ర పాటిస్తే
సామాన్యుల సంగతి సగం మునిగినట్టె!
అన్నాడొక అభాగ్య జ్ఞానీ!
ఎదయ, మీదయ
మామీదలేదయా!
మాన్యులు సామాన్యులు మనుషులేనయ్యా
మనుగడ కోసం, ధాన్య కోసం
ధనం కోసం ప్రకులాడటం తప్ప
మరోప్రపంచం, మరోదారి లేవు!
రోజులు మారాయి, రాజులు మారారు
మన తలరాతలు మారలేదు మహాత్మా!
--డా.కోడి రామా రావు(అల్ ఐన్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







