ఐఎస్బీలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 17, 2022 , by Maagulf
ఐఎస్బీలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) లో ఘనంగా జరిగాయి. భారతదేశం  స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాల చారిత్రక మైలురాయిని గుర్తుచేసుకోవడానికి మార్చి 2021లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ISB గౌరవాధ్యక్షుడు ప్రిన్స్ ఎస్ నటరాజన్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఇసా టౌన్ క్యాంపస్‌లో జరిగిన వేడుకలకు కార్యదర్శి సాజి ఆంటోని, విద్యావేత్తలు మహ్మద్ ఖుర్షీద్ ఆలం, యాక్టింగ్ ప్రిన్సిపల్ వినోద్ ఎస్, రిఫా క్యాంపస్ యాక్టింగ్ ప్రిన్సిపల్ లీలా వ్యాస్, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com