ఐఎస్బీలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 17, 2022
బహ్రెయిన్: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) లో ఘనంగా జరిగాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాల చారిత్రక మైలురాయిని గుర్తుచేసుకోవడానికి మార్చి 2021లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ISB గౌరవాధ్యక్షుడు ప్రిన్స్ ఎస్ నటరాజన్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఇసా టౌన్ క్యాంపస్లో జరిగిన వేడుకలకు కార్యదర్శి సాజి ఆంటోని, విద్యావేత్తలు మహ్మద్ ఖుర్షీద్ ఆలం, యాక్టింగ్ ప్రిన్సిపల్ వినోద్ ఎస్, రిఫా క్యాంపస్ యాక్టింగ్ ప్రిన్సిపల్ లీలా వ్యాస్, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







