ఢీకొన్న రెండు రైళ్లు.. 53 మందికి గాయాలు

- August 17, 2022 , by Maagulf
ఢీకొన్న రెండు రైళ్లు.. 53 మందికి గాయాలు

ముంబై: మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​ ట్రైన్​ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పగా 50 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com