దుబాయ్ లాటరీలో 50లక్షల దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు
- August 19, 2022
దుబాయ్: దుబాయ్లో మరో భారతీయుడికి జాక్పాట్ తగిలింది.దీంతో 50లక్షల దిర్హాములుగెలుచుకున్నాడు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన షాన్వాజ్ 15 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గడిచిన ఏడాదిన్నరగా దుబాయ్ ఆన్లైన్ లాటరీలో పాల్గొంటున్నాడు. ఇటీవల షాన్వాజ్ కొనుగోలు చేసిన 7, 9, 17, 19, 21 నంబర్ సిరీస్కు తాజాగా జాక్పాట్ తలిగింది. దీంతో మొదటి ప్రైజ్ కింద 50లక్షల దిర్హాములు గెలుచుకున్నాడు. ఇంతా భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల షాన్వాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ నగదులో కొంత మొత్తం తన అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తానని చెప్పిన షాన్వాజ్.. మిగిలిన సొమ్ముతో దుబాయ్లో బిజినెస్ ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే లాటరీలో మరో ఇద్దరు విదేశీయులు కూడా చెరో 50లక్షల దిర్హాములు గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!







