భారత్ కరోనా అప్డేట్
- August 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజువారీ కేసులు పెరుగుతునే ఉన్నాయి. మంగళవారం 8 వేలకు తగ్గిన రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం 12 వేల మందికిపైగా కరోనా నిర్ధారణకాగా, నేడు ఆసంఖ్య 15,754కు చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి పెరిగింది. ఇందులో 4,36,85,535 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,253 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,01,830 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో 47 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందగా, 15,220 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంనిణీ చేశామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..







