26/11 తరహాలో ఉగ్ర దాడులు చేస్తాం..
- August 20, 2022
ముంబై: 26/11 ఉగ్రదాడి తరహాలో దేశ ఆర్థిక రాజధాని ముంబై పై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది.ఈ మేరకు ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఒక మెసేజ్ వచ్చినట్లు వారు వెల్లడించారు.పాకిస్తాన్కు చెందిన ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. భారత్లో విధ్వంస ప్రణాళికలో ఆరుగురు వ్యక్తులు నిమగ్నమయ్యారని ఆ మెసేజ్ పేర్కొంది.
ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు. బెదిరింపు మెసేజ్పై ఇతర ఏజెన్సీలనూ అధికారులు అప్రమత్తం చేశారు.మహారాష్ట్రలోని రాయ్గఢ్ తీరంలో గురువారం బోటులో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్స్ పట్టుబడిన నేపధ్యంలో బెదిరింపు మెసేజ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 26/11 ఉగ్రదాడి తరహాలో పడవలో ఆయుధాలు లభ్యం కావడంతో ఉగ్రముప్పు పొంచిఉందనే ఆందోళన నెలకొంది.స్ధానిక పోలీసు అధికారులతో పాటు యాంటీ టెర్రర్ స్వ్కాడ్ బృందాలు ఘటనా స్ధలానికి చేరుకుని బోటు ఎక్కడినుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం కూడా ఘటనా స్ధలానికి చేరుకుంది.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







