మళ్లీ ఇలియానా టాలీవుడ్‌లో మెరవనుంది

- April 15, 2016 , by Maagulf
మళ్లీ ఇలియానా టాలీవుడ్‌లో మెరవనుంది

ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. దేవదాసు చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ అమ్మడు 2012 వరకూ కొనసాగింది. తర్వాత తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. బాలీవుడ్‌లో మాత్రం ఏడాదికొకటి చొప్పున చేస్తోంది. ఇప్పుడు అక్షరు కుమార్‌తో కలసి 'రస్టోమ్‌' చేస్తోంది. తెలుగులో మాత్రం ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమిటంటే టాలీవుడ్‌లో నటించేందుకు తన పారితోషికాన్ని కూడా తగ్గేసుకుంది. గత చిత్రాల్లో చేసిన దానికంటే మరింత గ్లామర్‌గా నటించేందుకూ అంగీకరిస్తుందట. అయినా అవకాశాలు దక్కకపోవడం విశేషం. మరికొన్ని రోజుల్లో తెలుగులో రెండు ప్రాజెక్టులు చేయొచ్చని తెలిసింది. వాటిపై ప్రస్తుతం చర్చలు జరుతున్నాయని సమాచారం. అవి సఫలమైతే మళ్లీ ఇలియానా టాలీవుడ్‌లో మెరవనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com