మళ్లీ ఇలియానా టాలీవుడ్లో మెరవనుంది
- April 15, 2016
ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్. దేవదాసు చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ అమ్మడు 2012 వరకూ కొనసాగింది. తర్వాత తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. బాలీవుడ్లో మాత్రం ఏడాదికొకటి చొప్పున చేస్తోంది. ఇప్పుడు అక్షరు కుమార్తో కలసి 'రస్టోమ్' చేస్తోంది. తెలుగులో మాత్రం ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమిటంటే టాలీవుడ్లో నటించేందుకు తన పారితోషికాన్ని కూడా తగ్గేసుకుంది. గత చిత్రాల్లో చేసిన దానికంటే మరింత గ్లామర్గా నటించేందుకూ అంగీకరిస్తుందట. అయినా అవకాశాలు దక్కకపోవడం విశేషం. మరికొన్ని రోజుల్లో తెలుగులో రెండు ప్రాజెక్టులు చేయొచ్చని తెలిసింది. వాటిపై ప్రస్తుతం చర్చలు జరుతున్నాయని సమాచారం. అవి సఫలమైతే మళ్లీ ఇలియానా టాలీవుడ్లో మెరవనుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









