ఖతార్-ఇండియా మధ్య ఎయిర్ ఇండియా కొత్త సర్వీసులు

- August 23, 2022 , by Maagulf
ఖతార్-ఇండియా మధ్య ఎయిర్ ఇండియా కొత్త సర్వీసులు

దోహా: ఎయిర్ ఇండియా అక్టోబర్ 30 నుండి దోహా, ఖతార్‌కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తోంది. దోహా-ముంబై-దోహా రూట్ కోసం టికెట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం మూడు విమాన సర్వీసులను నడుపనుంది. అక్టోబర్ 30న దోహా నుండి ముంబైకి నాన్‌స్టాప్ ఎయిర్ ఇండియా విమానం 12:45 గంటలకు బయలుదేరి.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందని పేర్కొంది, దీని టిక్కెట్ ధర QR920గా నిర్ణయించారు. ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ బుకింగ్‌లు ప్రస్తుతం మార్చి 19  వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. భవిష్యత్ లో వీటి సంఖ్యను ఆరుకు పెంచాలని యోచిస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అలాగే నవంబర్‌లో జరిగే ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా మరికొన్ని ప్రత్యేక సర్వీసులను ఎయిర్ ఇండియా నడపాలని యోచిస్తోందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com