సేవల్లో నిర్లక్ష్యం.. డ్రైవింగ్ స్కూల్ యజమాన్యానికి జైలుశిక్ష, జరిమానా
- August 23, 2022
మస్కట్: సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ కు సుహార్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్ట్ రెండు నెలల జైలు శిక్ష, RO100 జరిమానా విధించింది. డ్రైవింగ్ స్కూల్ క్లయింట్లలో ఒకరు సోహార్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. క్లయింట్ డ్రైవింగ్ నేర్పేందుకు ట్రైనర్ ను నియమించారు. కానీ అతడు మధ్యలోనే మరణించారు. అయినా మరో ట్రైనర్ ను డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేయలేదు. పైగా క్లయింట్ కట్టిన ఫీ ని కూడా తిరిగిఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రాయల్ డిక్రీ నంబర్ 66/2014 ద్వారా జారీ చేయబడిన వినియోగదారుల రక్షణ చట్టంలోని నిబంధనలను డ్రైవింగ్ స్కూల్ ఉల్లంఘించినట్లు క్లయింట్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకున్నది.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







