సేవల్లో నిర్లక్ష్యం.. డ్రైవింగ్ స్కూల్ యజమాన్యానికి జైలుశిక్ష, జరిమానా
- August 23, 2022
మస్కట్: సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ కు సుహార్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్ట్ రెండు నెలల జైలు శిక్ష, RO100 జరిమానా విధించింది. డ్రైవింగ్ స్కూల్ క్లయింట్లలో ఒకరు సోహార్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. క్లయింట్ డ్రైవింగ్ నేర్పేందుకు ట్రైనర్ ను నియమించారు. కానీ అతడు మధ్యలోనే మరణించారు. అయినా మరో ట్రైనర్ ను డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేయలేదు. పైగా క్లయింట్ కట్టిన ఫీ ని కూడా తిరిగిఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రాయల్ డిక్రీ నంబర్ 66/2014 ద్వారా జారీ చేయబడిన వినియోగదారుల రక్షణ చట్టంలోని నిబంధనలను డ్రైవింగ్ స్కూల్ ఉల్లంఘించినట్లు క్లయింట్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకున్నది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









