భారత్లోకి అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు పాకిస్తానీల కాల్చివేత
- August 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తానీలను ఇండియన్ ఆర్మీ కాల్చి చంపింది. జమ్ము-కాశ్మీర్, రాజౌరి జిల్లా, నౌషేరా సెక్టార్ పరిధిలోని ఎల్ఓసీ వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. సోమవారం సరిహద్దులో భద్రతా దళం గస్తీ కాస్తుండగా, ఇద్దరు పాకిస్తానీలు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
రాత్రిపూట చీకట్లో సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక ల్యాండ్మైన్ పేలింది. ఇది గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. సరిహద్దు వెంట గస్తీ నిర్వహించింది. ఈ దశలో ఇద్దరు చొరబాటుదారుల్ని గుర్తించిన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు. వీరిద్దరినీ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారు. తర్వాత వారి మృతదేహాల్ని సైన్యం స్వాధీనం చేసుకుంది.
ఈ ప్రాంతంలో ఇంకెవరైనా చొరబాటుదారులు వచ్చారా అనే కోణంలో అన్ని చోట్లా మరింత భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







