డ్రగ్ ప్రివెన్షన్ డ్రైవ్కి హాజరైన 1200 మంది విద్యార్థులు
- April 15, 2016
పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్కి చెందిన 1200 మంది విద్యార్థులు డ్రగ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ పదవ ఎడిషన్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ఐ యామ్ హ్యాపీ విత్ మై ఫెయిత్ అండ్ నాట్ విత్ అడిక్షన్' అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైన అతి గొప్ప కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు సైకోలాజికల్ కౌన్సిలింగ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఛైర్మన్ జస్సిమ్ అల్ మొహమ్మది. పాల్గొన్న విద్యార్థులు పలు యాక్టివిటీస్తో తమ ప్రతిభను చాటుకున్నారు. సమాజానికి డ్రగ్స్ కారణంగా కలిగే చేటు గురించి ప్రచారం చేసేందుకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పూర్తిగా తమ సహాయ సహకారాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇసా టౌన్లోని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ, సదరన్ గవర్నరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్ట్రీ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో నిర్వహించబడింది ఈ ఈవెంట్.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







