డ్రగ్ ప్రివెన్షన్ డ్రైవ్కి హాజరైన 1200 మంది విద్యార్థులు
- April 15, 2016
పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్కి చెందిన 1200 మంది విద్యార్థులు డ్రగ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ పదవ ఎడిషన్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ఐ యామ్ హ్యాపీ విత్ మై ఫెయిత్ అండ్ నాట్ విత్ అడిక్షన్' అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైన అతి గొప్ప కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు సైకోలాజికల్ కౌన్సిలింగ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఛైర్మన్ జస్సిమ్ అల్ మొహమ్మది. పాల్గొన్న విద్యార్థులు పలు యాక్టివిటీస్తో తమ ప్రతిభను చాటుకున్నారు. సమాజానికి డ్రగ్స్ కారణంగా కలిగే చేటు గురించి ప్రచారం చేసేందుకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పూర్తిగా తమ సహాయ సహకారాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇసా టౌన్లోని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ, సదరన్ గవర్నరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్ట్రీ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో నిర్వహించబడింది ఈ ఈవెంట్.
తాజా వార్తలు
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం







