భారత్-పాక్ మ్యాచ్లో ‘లైగర్’ సందడి..
- August 28, 2022
దుబాయ్: ఇటీవలే ‘లైగర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యువ హీరో విజయ్ దేవరకొండ దుబాయ్లో జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్ను నేరుగా వీక్షించాడు.ఆసియా కప్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ నేరుగా చూసేందుకు ఆయన దుబాయ్ చేరుకున్నాడు.స్టేడియంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, జతిన్ సప్రుతో మాట్లాడాడు.వారితో కలిసి మ్యాచ్ చూశాడు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మ్యాచ్ చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు.‘‘మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను.ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తాడని ఆశిస్తున్నా.20 పరుగులు చేశాడంటే కచ్చితంగా 50 పరుగులు సాధిస్తాడు. ఇది ఆయనకు వందో మ్యాచ్. ఆయన బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నా’’ అని విజయ్ వ్యాఖ్యానించాడు.విజయ్కు సంబంధించిన ఈ షెడ్యూల్ ముందుగానే ఫిక్సైంది.
మ్యాచ్ చూడటంతోపాటు, లైగర్ ప్రమోషన్ల కోసం కూడా ఇక్కడికి రావాలనుకున్నాడు.సినిమా నెగెటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ప్రేక్షకులతో కలిసి ఉత్సాహంగా మ్యాచ్ చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లడం విశేషం. ఇటీవలే పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘లైగర్’ నెగెటివ్ టాక్తో నడుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







