ఉద్యోగుల సెకండ్మెంట్ అభ్యర్థనలకు ఇ-సర్వీసులు ప్రారంభం
- September 01, 2022
ఖతార్: ఉద్యోగుల సెకండ్మెంట్ అభ్యర్థనల కోసం కొత్త ఇ-సేవను ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. ఈ సేవ ప్రక్రియలను వేగవంతం చేయడం, లావాదేవీలను పారదర్శకంగా పూర్తి చేయడానికి డిజిటల్ పరివర్తన వ్యూహంలో భాగంగా ఈ సర్వీసును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త సేవ ప్రస్తుత యజమానిని మార్చాల్సిన అవసరం లేకుండా మరొక కంపెనీ లేదా సంస్థకు కార్మికుల సెకండ్మెంట్ కోసం అభ్యర్థనలను సమర్పించడానికి కూడా అనుమతిస్తుందని పేర్కొంది. అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత ఉద్యోగులు కొత్త కంపెనీలో పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ పని చేసుకోవచ్చు.ఈ సేవ ప్రస్తుత యజమాని ఆమోదానికి లోబడి ఉంటుందని, వర్కర్ సెకండ్ చేయబడిన కంపెనీ కూడా పూర్తిగా రిజిస్టర్ చేయబడి ఉండాలని, 2004 నాటి లేబర్ లా నం. 14 నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెకండ్మెంట్ వ్యవధి గరిష్టంగా ఆరు నెలలు మించకూడదని, అలాగే ఉద్యోగి నివాస అనుమతి గడువు తేదీని కూడా మించకూడదని వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, ప్రజలు https://www.mol.gov.qa/ar/pages/default.aspx వెబ్సైట్ ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







