సెప్టెంబర్ 10 వరకు షైల్ 2022.. పాల్గొంటున్న 180 కంపెనీలు
- September 04, 2022
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ (కటారా) నిర్వహించే ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఫాల్కన్స్ ఎగ్జిబిషన్ (షైల్ 2022) ఆరవ ఎడిషన్లో వేట ఆయుధాలు, వేట సామాగ్రి, ఫాల్కన్లు, హంటింగ్ ట్రిప్స్లో నైపుణ్యం కలిగిన 20 దేశాల నుండి 180 కంపెనీలు పాల్గొననున్నాయి. ఇది సోమవారం ప్రారంభమై సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది. దేశంలోని అనేక మంత్రిత్వ శాఖలు, అధికారులు, ఇతర సంస్థలు హాజరు కానున్న ఈ ఎగ్జిబిషన్ కు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫాల్కన్రీ, వేటగాళ్లు, ఫాల్కన్ ప్రేమికులు హాజరవుతుంటారు. షైల్ ఎగ్జిబిషన్ ఐదు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. హెక్మా స్క్వేర్లోని ప్రధాన మందిరంలో స్నిపర్ సామాగ్రి, వేటకు ఉపయోగించే పరికరాలు, సాంప్రదాయ పరిశ్రమలు, వేటతో సంబంధం ఉన్న హస్తకళలు ప్రదర్శించబడతాయి. రెండవ ప్రాంతంలో ఆయుధ కంపెనీల కోసం ఒక హాల్ ని ఏర్పాటు చేశారు. మూడు, నాలుగులలో పక్షుల క్షేత్రాలు, వేట ప్రయాణాల కోసం ఫోర్-వీల్-డ్రైవ్ కార్లను ప్రదర్శించనున్నారు. కటారా దక్షిణ భాగంలో ఉన్న ఐదవ హాలులో ఆయుధాలు, రైఫిల్స్, మందుగుండు సామగ్రి ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. ఆరవ ఎడిషన్ లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనితోపాట ఫాల్కన్ రంగంలో నిపుణులు, ప్రముఖ వేటగాళ్లు తమ అనుభవాలను పంచుకునే పలు సెషన్ లను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







