సొంతచెల్లినే కిరాతకంగా చంపిన 15 ఏళ్ల బాలిక
- September 05, 2022
కువైట్: అసూయతో తోడబుట్టిన చెల్లిని ఓ అక్క కిరాతకంగా హత్య చేసింది. బెని సూఫ్ గవర్నరేట్ (ఉత్తర ఈజిప్ట్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈజిప్టు భద్రతా వర్గాల కథనం ప్రకారం.. తల్లిదండ్రులు తన కంటే చెల్లి(8)ని మెరుగ్గా చూసుకుంటున్నారని 15 ఏండ్ల బాలిక(తోబుట్టువు) భావించింది. దీంతో చెల్లిపై అసూయ పెంచుకున్న అక్క.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన చెల్లిని 55 సార్లు కత్తితో పొడిచి చంపింది. దీంతో బాలిక సంఘటన స్థలంలోనే చనిపోయింది. అనంతరం చనిపోయాన బాలికతోపాటు రక్తం బట్టలతో తడిసిన 15 ఏండ్ల బాలికను వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకురావడంతో విషయం పోలీసులకు చేరింది. ఈ సంఘటనపై విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. బాలికల తల్లిదండ్రులకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిపించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







