సొంతచెల్లినే కిరాతకంగా చంపిన 15 ఏళ్ల బాలిక
- September 05, 2022
కువైట్: అసూయతో తోడబుట్టిన చెల్లిని ఓ అక్క కిరాతకంగా హత్య చేసింది. బెని సూఫ్ గవర్నరేట్ (ఉత్తర ఈజిప్ట్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈజిప్టు భద్రతా వర్గాల కథనం ప్రకారం.. తల్లిదండ్రులు తన కంటే చెల్లి(8)ని మెరుగ్గా చూసుకుంటున్నారని 15 ఏండ్ల బాలిక(తోబుట్టువు) భావించింది. దీంతో చెల్లిపై అసూయ పెంచుకున్న అక్క.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన చెల్లిని 55 సార్లు కత్తితో పొడిచి చంపింది. దీంతో బాలిక సంఘటన స్థలంలోనే చనిపోయింది. అనంతరం చనిపోయాన బాలికతోపాటు రక్తం బట్టలతో తడిసిన 15 ఏండ్ల బాలికను వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకురావడంతో విషయం పోలీసులకు చేరింది. ఈ సంఘటనపై విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. బాలికల తల్లిదండ్రులకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిపించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







