సొంతచెల్లినే కిరాతకంగా చంపిన 15 ఏళ్ల బాలిక

- September 05, 2022 , by Maagulf
సొంతచెల్లినే కిరాతకంగా చంపిన 15 ఏళ్ల బాలిక

కువైట్: అసూయతో తోడబుట్టిన చెల్లిని ఓ అక్క కిరాతకంగా హత్య చేసింది. బెని సూఫ్ గవర్నరేట్ (ఉత్తర ఈజిప్ట్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈజిప్టు భద్రతా వర్గాల కథనం ప్రకారం.. తల్లిదండ్రులు తన కంటే చెల్లి(8)ని మెరుగ్గా చూసుకుంటున్నారని 15 ఏండ్ల బాలిక(తోబుట్టువు) భావించింది. దీంతో చెల్లిపై అసూయ పెంచుకున్న అక్క.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన చెల్లిని  55 సార్లు కత్తితో పొడిచి చంపింది. దీంతో బాలిక సంఘటన స్థలంలోనే  చనిపోయింది. అనంతరం చనిపోయాన బాలికతోపాటు రక్తం బట్టలతో తడిసిన 15 ఏండ్ల బాలికను వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకురావడంతో విషయం పోలీసులకు చేరింది. ఈ సంఘటనపై విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. బాలికల తల్లిదండ్రులకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిపించినట్లు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com