సొంతచెల్లినే కిరాతకంగా చంపిన 15 ఏళ్ల బాలిక
- September 05, 2022
కువైట్: అసూయతో తోడబుట్టిన చెల్లిని ఓ అక్క కిరాతకంగా హత్య చేసింది. బెని సూఫ్ గవర్నరేట్ (ఉత్తర ఈజిప్ట్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈజిప్టు భద్రతా వర్గాల కథనం ప్రకారం.. తల్లిదండ్రులు తన కంటే చెల్లి(8)ని మెరుగ్గా చూసుకుంటున్నారని 15 ఏండ్ల బాలిక(తోబుట్టువు) భావించింది. దీంతో చెల్లిపై అసూయ పెంచుకున్న అక్క.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన చెల్లిని 55 సార్లు కత్తితో పొడిచి చంపింది. దీంతో బాలిక సంఘటన స్థలంలోనే చనిపోయింది. అనంతరం చనిపోయాన బాలికతోపాటు రక్తం బట్టలతో తడిసిన 15 ఏండ్ల బాలికను వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకురావడంతో విషయం పోలీసులకు చేరింది. ఈ సంఘటనపై విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. బాలికల తల్లిదండ్రులకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిపించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- కొడుకు ప్రాణం తీసిన డ్రైవర్ను క్షమించిన తల్లిదండ్రులు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!









