దుబాయ్ లో గ్లైడర్ కూలి పైలట్ మృతి
- September 05, 2022
దుబాయ్: "అమెచ్యూర్-బిల్ట్" మోటరైజ్డ్ పారాగ్లైడర్ కూలిన ఘటనలో పైలట్ మృతి చెందాడని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(GCAA) తెలిపింది. మార్గమ్లోని స్కైడైవ్ క్లబ్ ప్రాంతంలో పారామోటర్ ఇంజిన్తో నడిచే గ్లైడర్ కూలిన ఘటనలో మృతిచెందిన పైలట్ దక్షిణాఫ్రికాకు చెందినవాడని అధికారులు తెలిపారు. క్రాష్పై దర్యాప్తు చేస్తున్నట్లు GCAA తెలిపింది. పారాగ్లైడర్లను సాధారణంగా ఎడారిలో ఎగరడానికి ఉపయోగిస్తారు. గత వారం అబుదాబిలోని షేక్ జాయెద్ మసీదు పార్కింగ్ స్థలంలో ఒక పౌర విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ గాయపడ్డ విషయం తెలిసిందే. అల్ బతీన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడానికి వెళుతుండగా.. సాంకేతిక లోపం కారణంగా జనావాసాలు లేని ప్రాంతంలో అది కూలిపోయింది.
తాజా వార్తలు
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







