భారత్ కరోనా అప్డేట్
- September 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రజా జీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. గత 24 గంటల్లో 2.27 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా… కొత్తగా 5,910 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 7,034 మంది మహమ్మారి నుంచి కోలుకోగా… 9 మంది మృతి చెందారు. కేరళ తన గణాంకాలను సవరించడంతో.. మరణాల సంఖ్య 16కి పెరిగింది.
ఇక ప్రస్తుతం దేశంలో 53,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,44,62,445కి చేరుకుంది. వీరిలో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,28,007 మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేపు 2.60 శాతానికి తగ్గిపోయింది. క్రియాశీల రేటు 0.12 శాతంగా, రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 213.52 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న 32.31 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









