ఒమానీ విద్యార్థులు, జపాన్ లో సురక్షీతం రాయబార కార్యాలయం వెల్లడి

- April 15, 2016 , by Maagulf
ఒమానీ విద్యార్థులు, జపాన్ లో సురక్షీతం  రాయబార కార్యాలయం వెల్లడి

జపాన్ నైరుతి క్యోశో లో 6. 4 తీవ్రతతో సంభవించిన  భూకంపంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ఒమానీ విద్యార్థులు, జపాన్ లో సురక్షీతంగా ఉన్నారని  టోక్యోలో సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.దౌత్యకార్యాలయం  తెలిపిన తాజా గణాంకాల ప్రకారం, తొమ్మిది మంది మరణీంచారని, దాదాపు 864 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. ఇళ్ళు ద్వంసం కావడం మరియు మంటలు ఎగసి పడటం భూకంపానికి అత్యంత శక్తివంతమైన ప్రభావం కుమామోతో ప్రాంతంలో జరిగినట్లు తెలిపింది. అత్యవసర విషయంలో విద్యార్థులు, పౌరులు దౌత్యకార్యాలయంను  సంప్రదించమని  దౌత్యకార్యాలయ అధికారులు ప్రజలను కోరారు .జపాన్ ను దర్శిస్తున్న ఒమానీయులు,  నివసిస్తున్నవారు తమ తమ వివరాలను ఒమనీ దౌత్యకార్యాలయం వద్ద  నమోద చేసుకోవాలని  దౌత్యకార్యాలయం అధికారులు కోరారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com