విమాన క్యాబిన్ నుంచి 20 కోట్ల బంగారం చోరీ..!!
- September 06, 2022
దుబాయ్: విమానంలో వెళ్లే సమయంలో ఆభరణాల వ్యాపారి బ్యాగ్ నుంచి రూ.20 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైంది. అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం దుబాయ్ నుండి కరాచీకి వెళ్లే విమానంలో పాకిస్తానీ నగల వ్యాపారి మహ్మద్ మూనిస్ ప్రయాణించాడు. ఈ క్రమంలో తన బ్యాగ్ నుంచి 1,542 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి.. విమాన సిబ్బందికి చెప్పారు. దీంతో సిబ్బంది చోరీకి గురైన బంగారం కోసం విమానమంత వెతికినా ఫలితం లేదు. విమానం కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత బంగారం కోసం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఏఎస్ఎఫ్) రంగంలోకి దిగి ప్రయాణికులను స్కానింగ్ చేసింది. అయినా విమానంలో చోరీకి గురైన బంగారం మాత్రం లభించలేదు. బంగారాన్ని తీసుకురావడంపై కస్టమ్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు నగల వ్యాపారి పేర్కొన్నారు. తాను చట్టబద్ధంగా ఎగుమతి చేసిన ఆభరణాలలో సగం విలువను బంగారం రూపంలో తిరిగి తీసుకెళుతున్నట్లు.. చోరీకి గురైన బంగారం కరాచీకి చెందిన నౌరత్తన్ జ్యువెలర్స్కు చెందినదని సదరు వ్యాపారి తెలిపారు. మరోవైపు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే సమయంలోనే బంగారం దొంగతనం జరిగి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ సమయంలో తన బ్యాగ్ లో బంగారం ఉన్నట్లు బాధిత నగల వ్యాపారి చెబుతున్నాడు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









