విమాన క్యాబిన్ నుంచి 20 కోట్ల బంగారం చోరీ..!!
- September 06, 2022
దుబాయ్: విమానంలో వెళ్లే సమయంలో ఆభరణాల వ్యాపారి బ్యాగ్ నుంచి రూ.20 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైంది. అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం దుబాయ్ నుండి కరాచీకి వెళ్లే విమానంలో పాకిస్తానీ నగల వ్యాపారి మహ్మద్ మూనిస్ ప్రయాణించాడు. ఈ క్రమంలో తన బ్యాగ్ నుంచి 1,542 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి.. విమాన సిబ్బందికి చెప్పారు. దీంతో సిబ్బంది చోరీకి గురైన బంగారం కోసం విమానమంత వెతికినా ఫలితం లేదు. విమానం కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత బంగారం కోసం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఏఎస్ఎఫ్) రంగంలోకి దిగి ప్రయాణికులను స్కానింగ్ చేసింది. అయినా విమానంలో చోరీకి గురైన బంగారం మాత్రం లభించలేదు. బంగారాన్ని తీసుకురావడంపై కస్టమ్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు నగల వ్యాపారి పేర్కొన్నారు. తాను చట్టబద్ధంగా ఎగుమతి చేసిన ఆభరణాలలో సగం విలువను బంగారం రూపంలో తిరిగి తీసుకెళుతున్నట్లు.. చోరీకి గురైన బంగారం కరాచీకి చెందిన నౌరత్తన్ జ్యువెలర్స్కు చెందినదని సదరు వ్యాపారి తెలిపారు. మరోవైపు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే సమయంలోనే బంగారం దొంగతనం జరిగి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ సమయంలో తన బ్యాగ్ లో బంగారం ఉన్నట్లు బాధిత నగల వ్యాపారి చెబుతున్నాడు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









