విమాన క్యాబిన్ నుంచి 20 కోట్ల బంగారం చోరీ..!!
- September 06, 2022
దుబాయ్: విమానంలో వెళ్లే సమయంలో ఆభరణాల వ్యాపారి బ్యాగ్ నుంచి రూ.20 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైంది. అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం దుబాయ్ నుండి కరాచీకి వెళ్లే విమానంలో పాకిస్తానీ నగల వ్యాపారి మహ్మద్ మూనిస్ ప్రయాణించాడు. ఈ క్రమంలో తన బ్యాగ్ నుంచి 1,542 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి.. విమాన సిబ్బందికి చెప్పారు. దీంతో సిబ్బంది చోరీకి గురైన బంగారం కోసం విమానమంత వెతికినా ఫలితం లేదు. విమానం కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత బంగారం కోసం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఏఎస్ఎఫ్) రంగంలోకి దిగి ప్రయాణికులను స్కానింగ్ చేసింది. అయినా విమానంలో చోరీకి గురైన బంగారం మాత్రం లభించలేదు. బంగారాన్ని తీసుకురావడంపై కస్టమ్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు నగల వ్యాపారి పేర్కొన్నారు. తాను చట్టబద్ధంగా ఎగుమతి చేసిన ఆభరణాలలో సగం విలువను బంగారం రూపంలో తిరిగి తీసుకెళుతున్నట్లు.. చోరీకి గురైన బంగారం కరాచీకి చెందిన నౌరత్తన్ జ్యువెలర్స్కు చెందినదని సదరు వ్యాపారి తెలిపారు. మరోవైపు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే సమయంలోనే బంగారం దొంగతనం జరిగి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ సమయంలో తన బ్యాగ్ లో బంగారం ఉన్నట్లు బాధిత నగల వ్యాపారి చెబుతున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







