రౌడీ విజయ్ నెక్స్ట్ ఏంటీ.? ‘లైగర్’ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా.?
- September 07, 2022
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ‘లైగర్’ తేరుకోలేని షాక్ ఇచ్చింది. భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాగా రూపొందిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాంతో విజయ్ దేవరకొండ కెరీర్ అగమ్య గోచరంగా మారిపోయింది.
సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా తన ఆటిట్యూడే బలంగా దూసుకొచ్చాడింతవరకూ విజయ్ దేవరకొండ. కానీ, ‘లైగర్’తో ఇంతవరకూ విజయ్ దేవరకొండ సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంటున్నారు.
సినిమా దారుణంగా నష్టాలు మిగిల్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏం చేసినా, ఎంత చేసినా ఆ టాక్ నుంచి బయట పడలేకపోయింది ‘లైగర్’. దాంతో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాడట. అదే ‘జనగణమన’ ప్రాజెక్టు. ఇది కూడా పూరీ చేతుల్లోనే వుంది.
కానీ, ‘లైగర్’ డిజాస్టర్తో మరో రిస్క్ చేయాలనుకోవడం లేదట విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికి ‘ఖుషీ’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ విజయ్ చేతుల్లో వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైనే తన ఫోకస్ అంతా పెట్టేశాడట. ‘లైగర్’ కోసం చాలా కష్టపడి కండలు కరిగించేశాడు విజయ్ దేవరకొండ. ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. రౌడీ ఫ్యాన్స్ని బాగా బాధిస్తోన్న విషయం ఆ ఒక్కటే.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







