రౌడీ విజయ్ నెక్స్ట్ ఏంటీ.? ‘లైగర్’ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా.?
- September 07, 2022
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ‘లైగర్’ తేరుకోలేని షాక్ ఇచ్చింది. భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాగా రూపొందిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాంతో విజయ్ దేవరకొండ కెరీర్ అగమ్య గోచరంగా మారిపోయింది.
సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా తన ఆటిట్యూడే బలంగా దూసుకొచ్చాడింతవరకూ విజయ్ దేవరకొండ. కానీ, ‘లైగర్’తో ఇంతవరకూ విజయ్ దేవరకొండ సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంటున్నారు.
సినిమా దారుణంగా నష్టాలు మిగిల్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏం చేసినా, ఎంత చేసినా ఆ టాక్ నుంచి బయట పడలేకపోయింది ‘లైగర్’. దాంతో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాడట. అదే ‘జనగణమన’ ప్రాజెక్టు. ఇది కూడా పూరీ చేతుల్లోనే వుంది.
కానీ, ‘లైగర్’ డిజాస్టర్తో మరో రిస్క్ చేయాలనుకోవడం లేదట విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికి ‘ఖుషీ’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ విజయ్ చేతుల్లో వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైనే తన ఫోకస్ అంతా పెట్టేశాడట. ‘లైగర్’ కోసం చాలా కష్టపడి కండలు కరిగించేశాడు విజయ్ దేవరకొండ. ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. రౌడీ ఫ్యాన్స్ని బాగా బాధిస్తోన్న విషయం ఆ ఒక్కటే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







