ఈ నెల 23 న బహ్రెయిన్ లో గర్భా దండియా
- September 07, 2022
బహ్రెయిన్: మూడేళ్ల తర్వాత బహ్రెయిన్ లో మళ్లీ దండియా సందడి మొదలు కానుంది. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఆధ్వర్యంలో ఈ సారి గర్భా నృత్యాలతో పాటు దండియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 న "గార్భా ని రాత్- గ్రాండ్ దండియా నైట్ -2022" పేరుతో క్రౌన్ ప్లాజా బాల్ రూమ్ లో కార్యక్రమం జరగనుంది.ఇండియన్ లేడీస్ అసోసియేషన్, మెగా మార్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.ఇందులో భారత సాంప్రదాయ నృత్యం, సాంప్రదాయ డప్పు కళలను కూడా ప్రదర్శించనున్నారు.హస్త, చేనేత కళల ఎగ్జిబిషన్ ను కూడా నిర్వహించనున్నట్లు ఐఎల్ఏ తెలిపింది.జ్యువెల్లరీ, ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. బహ్రెయిన్ ఆల్ టైమ్ ఫేవరేట్ డీజే నిర్మల్ ఆధ్వర్యంలో దండియా, గార్భా మ్యూజిక్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా మూడేళ్ల పాటు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ ఏడాది పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ గర్భా దండియా కార్యక్రమంతో సందడి నెలకొననుంది. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ గత 65 ఏళ్లుగా భారత్, బహ్రెయిన్ మధ్య సంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఏఎల్ఏ ప్రెసిడెంట్ షిప్రా ఫస్సీ తెలిపారు.
తాజా వార్తలు
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!









