ఈ నెల 23 న బహ్రెయిన్ లో గర్భా దండియా
- September 07, 2022
బహ్రెయిన్: మూడేళ్ల తర్వాత బహ్రెయిన్ లో మళ్లీ దండియా సందడి మొదలు కానుంది. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఆధ్వర్యంలో ఈ సారి గర్భా నృత్యాలతో పాటు దండియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 న "గార్భా ని రాత్- గ్రాండ్ దండియా నైట్ -2022" పేరుతో క్రౌన్ ప్లాజా బాల్ రూమ్ లో కార్యక్రమం జరగనుంది.ఇండియన్ లేడీస్ అసోసియేషన్, మెగా మార్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.ఇందులో భారత సాంప్రదాయ నృత్యం, సాంప్రదాయ డప్పు కళలను కూడా ప్రదర్శించనున్నారు.హస్త, చేనేత కళల ఎగ్జిబిషన్ ను కూడా నిర్వహించనున్నట్లు ఐఎల్ఏ తెలిపింది.జ్యువెల్లరీ, ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. బహ్రెయిన్ ఆల్ టైమ్ ఫేవరేట్ డీజే నిర్మల్ ఆధ్వర్యంలో దండియా, గార్భా మ్యూజిక్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా మూడేళ్ల పాటు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ ఏడాది పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ గర్భా దండియా కార్యక్రమంతో సందడి నెలకొననుంది. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ గత 65 ఏళ్లుగా భారత్, బహ్రెయిన్ మధ్య సంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఏఎల్ఏ ప్రెసిడెంట్ షిప్రా ఫస్సీ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







