దుబాయ్-కోచి విమానంలో స్పృహతప్పిపోయిన మహిళ మృతి
- September 11, 2022
దుబాయ్: విమాన ప్రయాణం మధ్యలో స్పృహ కోల్పోయిందా మహిళ.దీంతో కంగారు పడిన సిబ్బంది..విమానం ల్యాండవ్వగానే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు.
కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.ఆస్పత్రికి వచ్చేసరికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు.ఈ ఘటన దుబాయ్ నుంచి కోచి వస్తున్న విమానంలో వెలుగు చూసింది.
మిని (56) అనే మహిళ ఈ విమానంలో భారత్ వస్తోంది.అయితే విమాన ప్రయాణం మధ్యలో ఆమె కళ్లు తిరిగి పడిపోయింది.దాంతో విమానం కోచిలో ల్యాండవగానే సిబ్బంది హడావుడిగా ఆమెను దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఆమెది సహజ మరణమని డాక్టర్లు చెప్పడంతో ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







