దుబాయ్-కోచి విమానంలో స్పృహతప్పిపోయిన మహిళ మృతి
- September 11, 2022
దుబాయ్: విమాన ప్రయాణం మధ్యలో స్పృహ కోల్పోయిందా మహిళ.దీంతో కంగారు పడిన సిబ్బంది..విమానం ల్యాండవ్వగానే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు.
కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.ఆస్పత్రికి వచ్చేసరికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు.ఈ ఘటన దుబాయ్ నుంచి కోచి వస్తున్న విమానంలో వెలుగు చూసింది.
మిని (56) అనే మహిళ ఈ విమానంలో భారత్ వస్తోంది.అయితే విమాన ప్రయాణం మధ్యలో ఆమె కళ్లు తిరిగి పడిపోయింది.దాంతో విమానం కోచిలో ల్యాండవగానే సిబ్బంది హడావుడిగా ఆమెను దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఆమెది సహజ మరణమని డాక్టర్లు చెప్పడంతో ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









