ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
- September 14, 2022
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు AAI యొక్క http://aai.aeroవెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ (AAI రిక్రూట్మెంట్ 2022) ప్రక్రియ ద్వారా మొత్తం 156 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఖాళీలు విద్యార్హతల వివరాలు: మొత్తం నాలుగు విభాగాల్లో 156 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) : అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3 సంవత్సరాల ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లొమా లేదా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 3 లేదా 6 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్తో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి కామర్స్లో గ్రాడ్యుయేట్ పట్టా పొంది ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (Official Language): ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఆంగ్లంలో గ్రాడ్యుయేట్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
కనిష్ట వయో పరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి: 30 సంవత్సరాలు
AAI రిక్రూట్మెంట్ 2022 ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









