లండన్కు చేరుకున్న క్వీన్ ఎలిజబెత్–2 పార్థివదేహాం..
- September 14, 2022
లండన్: క్వీన్ ఎలిజబెత్–2 పార్థివదేహాం స్కాట్ లాండ్ లోని ఎడిన్ బరో నుంచి గత రాత్రి సైనిక రవాణా విమానంలో లండన్ కు చేరింది. క్వీన్ శవపేటికను కింగ్ ఛార్లెస్.. ఆయన భార్య కెమిల్లా అందుకున్నారు. క్వీన్ డెడ్ బాడీని బకింగ్ హం ప్యాలెస్ లోని బౌ రూంలో ఉంచారు. రాజవంశీయులందరూ నివాళులు అర్పిస్తున్నారు. క్వీన్ గార్డెన్స్, దమాల్, హార్స్ గార్డ్స్, వైట్ హాల్, పార్లమెంటు స్ట్రీట్, పార్లమెంట్ స్క్వేర్, న్యూ ప్యాలెస్ యార్డ్ మీదుగా శవపేటికను ఊరిగేంపుగా.. పార్లమెంటు బిల్డింగ్ వెస్ట్ మినిస్టర్ కు తరలిస్తారు. ఇందుకోసం సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. వెన్స్ట మినిస్టర్ నుంచి స్థానిక టవర్ బ్రిడ్జి వరకూ సుమారు 5 కిలోమీటర్ల క్యూ ఏర్పడుతుందని భావిస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 అంత్యక్రియలు సెప్టెంబర్ 19న జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
పపువా న్యూగినియా నేతలు క్వీన్ ఎలిజిబెత్ కు నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కింగ్ ఛార్లెస్–3 ని తమ రాజ్యాధినేతగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా, దాని మిత్రదేశ బెలారస్, సైనిక పాలన ఉన్న మయన్మార్ దేశాలకు క్వీన్ అంత్యక్రియలకు ఆహ్వానం పంపలేదని… స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







