అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం: లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి
- September 14, 2022
గుజరాత్: గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
“కూలీలతో వెళ్తున్న లిఫ్ట్.. 7వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్న 8 మంది మరణించినట్లు తెలుస్తుంది. మృతులంతా ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలు” అని అహ్మదాబాద్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు. అయితే ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్ఛార్జి జయేశ్ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రక్షణపరమైన లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









