అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం: లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి
- September 14, 2022
గుజరాత్: గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
“కూలీలతో వెళ్తున్న లిఫ్ట్.. 7వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్న 8 మంది మరణించినట్లు తెలుస్తుంది. మృతులంతా ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలు” అని అహ్మదాబాద్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు. అయితే ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్ఛార్జి జయేశ్ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రక్షణపరమైన లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు