అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం: లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి
- September 14, 2022
గుజరాత్: గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
“కూలీలతో వెళ్తున్న లిఫ్ట్.. 7వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్న 8 మంది మరణించినట్లు తెలుస్తుంది. మృతులంతా ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలు” అని అహ్మదాబాద్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు. అయితే ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్ఛార్జి జయేశ్ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రక్షణపరమైన లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







