న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- September 24, 2025
న్యూయార్క్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది న్యూయార్క్ లో బిజిబిజీగా గడిపారు. అనేక దేశాల విదేశాంగ మంత్రులను కలిశారు. ఆయా దేశాలతో ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడంపై వారితో చర్చలు జరిపారు.
సముద్ర రంగంలో సహకారం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి సైప్రస్ విదేశాంగ మంత్రితో చర్చించారు. అనంతరం కొలంబియన్ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ సంప్రదింపులపై కుదిరిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒమన్-కొలంబియా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు.
ఉత్తర మాసిడోనియా ప్రతినిధితో సమావేశమైన సయ్యద్ బదర్.. పరస్పర సహకార రంగాలను గుర్తించడం, ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడం గురించి చర్చించారు. చివరగా బురుండి ఆర్థిక మంత్రితో సమావేశం అయ్యారు. రాజకీయ సంప్రదింపులకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, ఒమన్ అధికార ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









