న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- September 24, 2025
న్యూయార్క్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది న్యూయార్క్ లో బిజిబిజీగా గడిపారు. అనేక దేశాల విదేశాంగ మంత్రులను కలిశారు. ఆయా దేశాలతో ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడంపై వారితో చర్చలు జరిపారు.
సముద్ర రంగంలో సహకారం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి సైప్రస్ విదేశాంగ మంత్రితో చర్చించారు. అనంతరం కొలంబియన్ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ సంప్రదింపులపై కుదిరిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒమన్-కొలంబియా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు.
ఉత్తర మాసిడోనియా ప్రతినిధితో సమావేశమైన సయ్యద్ బదర్.. పరస్పర సహకార రంగాలను గుర్తించడం, ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడం గురించి చర్చించారు. చివరగా బురుండి ఆర్థిక మంత్రితో సమావేశం అయ్యారు. రాజకీయ సంప్రదింపులకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, ఒమన్ అధికార ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









