న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- September 24, 2025
న్యూయార్క్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది న్యూయార్క్ లో బిజిబిజీగా గడిపారు. అనేక దేశాల విదేశాంగ మంత్రులను కలిశారు. ఆయా దేశాలతో ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడంపై వారితో చర్చలు జరిపారు.
సముద్ర రంగంలో సహకారం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి సైప్రస్ విదేశాంగ మంత్రితో చర్చించారు. అనంతరం కొలంబియన్ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ సంప్రదింపులపై కుదిరిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒమన్-కొలంబియా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు.
ఉత్తర మాసిడోనియా ప్రతినిధితో సమావేశమైన సయ్యద్ బదర్.. పరస్పర సహకార రంగాలను గుర్తించడం, ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడం గురించి చర్చించారు. చివరగా బురుండి ఆర్థిక మంత్రితో సమావేశం అయ్యారు. రాజకీయ సంప్రదింపులకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, ఒమన్ అధికార ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







