న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- September 24, 2025
న్యూయార్క్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది న్యూయార్క్ లో బిజిబిజీగా గడిపారు. అనేక దేశాల విదేశాంగ మంత్రులను కలిశారు. ఆయా దేశాలతో ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడంపై వారితో చర్చలు జరిపారు.
సముద్ర రంగంలో సహకారం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి సైప్రస్ విదేశాంగ మంత్రితో చర్చించారు. అనంతరం కొలంబియన్ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ సంప్రదింపులపై కుదిరిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒమన్-కొలంబియా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు.
ఉత్తర మాసిడోనియా ప్రతినిధితో సమావేశమైన సయ్యద్ బదర్.. పరస్పర సహకార రంగాలను గుర్తించడం, ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడం గురించి చర్చించారు. చివరగా బురుండి ఆర్థిక మంత్రితో సమావేశం అయ్యారు. రాజకీయ సంప్రదింపులకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, ఒమన్ అధికార ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు