ఖర్కివ్లో శవాల దిబ్బలు..
- September 16, 2022
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్యా సేనల అధీనంలో ఉన్న దేశంలోని రెండో అతిపెద్ద పట్టణమైన ఖర్కివ్ను ఉక్రెయిన్ దళాలు మళ్లీ స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నగరాన్ని పరిశీలించగా ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలు కనిపించాయి. ఇక్కడి శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మృతుల్లో చాలామంది తుపాకి తూటాలకు బలికాగా, మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. చంపడానికి ముందు వారిని హింసించిన గుర్తులు కూడా ఉన్నాయని అన్నారు.
అలాగే, అదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు కూడా ఉన్నట్టు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. వీరిని పూడ్చిన ప్రాంతం చుట్టూ వందలాది చిన్నచిన్న సమాధులు ఉన్నట్టు ఆ కథనం పేర్కొంది. ఖర్కివ్ తిరిగి ఉక్రెయిన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రష్యా ప్రతి చోటా మరణశాసనం రాసిందన్నారు. అప్పట్లో బుచా, మేరియుపోల్ తర్వాత ఇప్పుడు ఖర్కివ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్









