భారత్ కరోనా అప్డేట్
- September 16, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య నిలకడగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 6,298 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,916 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్తగా నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం దేశంలో 46,748 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,39,47,756 మంది కోలుకోగా… 5,28,273 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,16,17,78,020 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 19,61,896 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







